ఇటీవల రామ్ చరణ్ కథానాయకుడు గా బోయపాటి దర్శకత్వంలో విడుదలైనా చిత్రం వినయ విధేయ రామ , ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులు కూడా నిరాశ పడ్డారు .. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి సంభందించి రామ్ చరణ్ అభిమానులకి ఒక లేఖ ని విడుదల చేసారు .
“ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల, మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు. మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్చరణ్’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ లేఖలో ఎక్కడ కూడా బోయపాటి గురుంచి ప్రస్తావించలేదు , షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పు మన్నాయి , ఇప్పుడు రాంచరణ్ ఆయన గురుంచి ప్రస్తావించకపోవడంతో అది నిజమేననుకుంటున్నారు సినీ జనాలు ..